ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్కు 2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలు, నిర్భయ తల్లి ఆశాదేవి మద్దతుగా నిలిచారు. ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్గా మాలీవాల్ మహిళల హక్కుల కోసం పోరాడారు. అలాంటి ఆమెకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మహిళల సంక్షేమం కోసం స్వాతి 8 ఏళ్లుగా కేజ్రీవాల్తో అనుబంధం కలిగి ఉన్నారు. ఆమె వల్ల చాలా మంది మహిళలు సహాయం పొందారు. సీఎం చర్యలు తీసుకుని స్వాతి మలివాల్కు న్యాయం చేయాలని ఆమె పేర్కొన్నారు.