ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
దస్తురాబాద్ మండలంలో శుక్రవారం 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండలంలోని గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు, పోలీస్ స్టేషన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి పథకావిష్కరణ చేశారు. పలు పాఠశాలలలో విద్యార్థులకు నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. మిఠాయిలు పంచి పెట్టారు.