Jul 14, 2024, 14:07 IST/నిర్మల్
నిర్మల్
సాగర్ కాలనీలో వైద్య శిబిరం ఏర్పాటు
Jul 14, 2024, 14:07 IST
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని నగర్ సాగర్ కాలనీ కమ్యూనిటీ హాల్ లో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యులు వేంపల్లి రాజశేఖర్ ఆధ్వర్యంలో కాలనీ వాసులకు బిపి, షుగర్, థైరాయిడ్ టెస్టులను నిర్వహించారు. అవసరమున్న వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఇందులో కమిటీ అధ్యక్షుడు రమేష్, కోశాధికారి సాగర్ రెడ్డి, సభ్యులు వంశీ, శ్రీనివాస్, మహేష్, లోకేష్, ఆనంద్, రఘు, ఎర్ర శ్రీనివాస్ పాల్గొన్నారు.