ఉట్నూర్లో బిఆర్ఎస్ నాయకుల ఆందోళన

78చూసినవారు
రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉట్నూరు పట్టణంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. మాజీ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు వారు గురువారం ఉట్నూరు పట్టణంలోని స్థానిక ఐబి వద్ద ఆందోళన చేశారు. రైతులకు ప్రభుత్వం పాక్షికంగా రుణమాఫీ చేసి గొప్పలు చెప్పుకుంటుందని మండిపడ్డారు. ఇప్పటికైనా అందరు రైతులకు ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్