ఆంక్షలు లేని రుణమాఫీ చేయాలని ఆందోళన

57చూసినవారు
రైతులకు ఆంక్షలు లేని రుణమాఫీ చేయాలని కోరుతూ జన్నారం పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళన నిర్వహించారు. మాజీ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు వారు గురువారం జన్నారం పట్టణంలోని కవ్వాల్ చౌరస్తాలో ఉన్న ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. ప్రభుత్వం రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయక మోసం చేస్తోందని వారు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి చంద్రశేఖర్, నాయకులు జనార్ధన్, భరత్, మున్వర్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్