సేవలతో ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు లభిస్తుందని జన్నారం మండల విద్యాశాఖ అధికారి విజయ్ కుమార్ అన్నారు. జన్నారం మండలంలోని ధర్మారం గ్రామ ప్రభుత్వ పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తున్న రాంరెడ్డి ఆదివారం ఉద్యోగ విరమణ చేశారు. దీంతో రామ్ రెడ్డి దంపతులను ఎంఈఓ, ఆ పాఠశాల ఉపాధ్యాయులు శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. రాంరెడ్డి విద్యార్థులకు మంచిగా విద్యాబోధన చేస్తూ వారి భవిష్యత్తుకు బంగారు బాట వేశారని ప్రశంసించారు.