భారీ వర్షం నమోదు

79చూసినవారు
జన్నారం మండలంలోని పలు గ్రామాలలో కురిసిన భారీ వర్షంతో వాతావరణం చల్లబడింది. రెండు మూడు రోజులుగా మండలంలో పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల వరకు నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు. దీంతో ఉక్కపోత పెరిగి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గురువారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో జన్నారం మండలంలోని పలు గ్రామాలలో మోస్తారు నుంచి భారీ వర్షం పడింది. దీంతో వాతావరణం చల్ల పడటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్