సుందరయ్య నగర్ లో కార్మిక దినోత్సవం

75చూసినవారు
సుందరయ్య నగర్ లో కార్మిక దినోత్సవం
జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో ఉన్న సుందరయ్య నగర్ లో మేడేను సిపిఎం, సిఐటియు, వ్యవసాయ సంఘం నాయకులు నిర్వహించారు. బుధవారం సుందరయ్య నగర్ లో వారు మేడే జెండాను ఎగురవేశారు. కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలు చేస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కనికారావు అశోక్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకురాలు మగ్గిడి జయ, సిఐటియు నాయకులు బుచ్చయ్య, పలు సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్