జన సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆశయ సాధనకు కృషి చేద్దామని బిజెపి నాయకులు రితేష్ రాథోడ్ అన్నారు. శ్యాం ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం ఉట్నూర్ పట్టణంలోని లక్కారంలో బిజెపి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.