పటిష్ట చట్టాలు ఉంటేనే మహిళలకు రక్షణ

50చూసినవారు
పటిష్ట చట్టాలు ఉంటేనే మహిళలకు రక్షణ లభిస్తుందని ఐద్వా మహిళా సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు పోతు విజయశంకర్ అన్నారు. కలకత్తాలో ట్రైనీ డాక్టర్ పై జరిగిన హత్యాచారానికి నిరసనగా బుధవారం రాత్రి జన్నారం పట్టణంలోని రాంనగర్లో స్థానిక మహిళలతో కలిసి ఆమె కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు రెండు నిమిషాలు మౌనం పాటించారు. మహిళల రక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్