ఎండల తీవ్రత పెరిగే అవకాశం

73చూసినవారు
ఎండల తీవ్రత పెరిగే అవకాశం
ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బుధవారం మ. 3 గంటలకు నియోజకవర్గంలోని పలు మండలాల్లో 39 డిగ్రీల పగటి గరిష్ట ఉష్ణోగ్రత నమోదయిందన్నారు. రాబోయే నాలుగు రోజులపాటు పగటి ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీల మధ్య నమోదయి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్ళవద్దని, వెళితే జాగ్రత్తలు తీసుకోవాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్