ఢిల్లీలో బుధవారం ఊహించని ప్రమాదం జరిగింది. కదులుతున్న ట్రక్కుపై బిలాల్ (20) ఓ యువకుడు నిల్చున్నాడు. ఆ సమయంలో ట్రక్కు ఆదర్శ్నగర్ మెట్రో స్టేషన్ కింద నుంచి వెళ్తుండగా యువకుడి తల స్టేషన్ బీమ్కు తగిలింది. దీంతో ఆ యువకుడు కింద పడ్డాడు. అపస్మారక స్థితికి చేరుకున్న యువకుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆ యువకుడు చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.