నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

50చూసినవారు
నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంద్రవెల్లి మండల పోలీసులు హెచ్చరించారు. శనివారం సాయంత్రం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై వారు ప్రజలకు, వాహనదారులకు రోడ్డు నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహనదారులు వారి వాహనాలను పరిమిత వేగంతోనే నడపాలన్నారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సి, ఇన్సూరెన్స్ కాగితాలను వెంట ఉంచుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్