పశువుల సంచారంతో తప్పని తిప్పలు

71చూసినవారు
జన్నారం పట్టణంలోని ప్రధాన రహదారిపై పశువుల సంచారంతో ప్రజలు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. జన్నారం పట్టణం నాలుగైదు జిల్లాలకు వెళ్లే ప్రధాన సరిహద్దులో ఉంది. దీంతో నిత్యం పలు ప్రాంతాల నుండి వచ్చే వాహనాలతో రద్దీగా ఉంటుంది. జన్నారం పట్టణంలోని ప్రధాన రహదారిపై పశువులు సంచరిస్తుండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పలు సందర్భాల్లో పశువులు కూడా గాయపడుతున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్