మూతబడ్డ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల

64చూసినవారు
కుబీర్ మండలం రాజురా ప్రభుత్వ పాఠశాల మూతపడింది. ఏళ్ల క్రితం నిర్మించిన భవనం వర్షానికి ఉరుస్తుండడంతో అధికారులు మూసివేశారు. పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండగా 11మంది విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యేవారు. ఓ ఉపాధ్యాయుడు బడిలీపై సారంగాపూర్ కు వెళ్లారు. మరో ఉపాధ్యాయుడిని బెల్లాంతండా కు అధికారులు పంపించారు. దీంతో విద్యార్థులను పోషకులు ప్రైవేటు పాఠశాలలో చేర్పించారు. పాఠశాలను ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్