యువకుడి ప్రాణం తీసిన మద్యం అలవాటు

1055చూసినవారు
యువకుడి ప్రాణం తీసిన మద్యం అలవాటు
లొకేశ్వరం మండలంలోని బిలోలి గ్రామానికి చెందిన ప్రశాంత్ (24) ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం గత కొన్ని నెలలుగా మద్యానికి బానిసై ఇంట్లో గొడవ పడుతూ పనికి వెళ్లకుండా ఖాళీగా ఉంటున్నాడు. ఆదివారం అతిగా మద్యం సేవించి, ఆ మత్తులో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. భార్య సౌజన్య ఫిర్యాదుతో కేసు నమోదు చెలుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్