బాసర అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ

75చూసినవారు
బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడం, నేడు ఆదివారం సెలవు దినం కావటంతో ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. గోదావరి నదిలో స్నానాలు ఆచరించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ చిన్నారులకు అక్షర శ్రీకారాలు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రత కారణంగా చలువ పందిళ్లు వేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్