పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

77చూసినవారు
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పంచాయతీ కార్యదర్శి అరుణ్ అన్నారు. లోకేశ్వరం మండలంలోని బిలోలీ గ్రామంలో మంగళవారం డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ఆరుబయట ఉన్న నీళ్ళ కుండీలు, డ్రమ్ములు, పాత టైర్లు వంటివి పరిశీలించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే వ్యాధుల దరిచేరవని గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం రేష్మ, ఆశా వర్కర్ రుక్మిణి తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్