లక్షణచాంద మండలం పీచర-రాచాపూర్ మార్గంలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ధర్మారం గ్రామానికి చెందిన తోకల పోషన్న గ్రామం నుంచి కనకాపూర్ వైపు బైక్ పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పోషన్న అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కుమారుడు, కుమారై ఉన్నారు.