పన్నులు వసూలు చేస్తున్న మున్సిపల్ అధికారులు

61చూసినవారు
పన్నులు వసూలు చేస్తున్న మున్సిపల్ అధికారులు
నిర్మల్ పట్టణంలోని పలు వార్డులో ఆదివారం మున్సిపల్ అధికారులు పన్నులు వసూలు చేశారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు ఆదివారం చివరి రోజు కావడంతో మున్సిపల్ అధికారులు ఇంటింటా తిరుగుతూ పన్నులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం 90 శాతం వడ్డీ మాఫీ ప్రకటించడంతో గతంలో పన్నులు చెల్లించని వారు వడ్డీ మాఫీని సద్వినియోగం చేసుకుంటున్నారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు శ్రీనివాస్, షకీర్ ఖాన్, తదితరులున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్