జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన వ్యవసాయాధికారి
సారంగాపూర్ మండల కేంద్రంలో ఫ్యాక్స్ కౌట్ల బి ఆధ్వర్యంలో సారంగాపూర్ మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఏవో రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ ప్రతిరోజు టోకెన్ ప్రకారం కొనుగోలు జరుగుతుందని తెలిపారు. 14 శాతం తేమ మద్దతు ధర 3180 రూపాయలు ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ సీఈవో ఎండి సలీం, మార్కెట్ యార్డ్ సెక్రటరీ మాధవ్, ఫాక్స్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.