బిహార్లో మహాకూటమికి వీడ్కోలు పలికిన నీతీశ్ కుమార్ భాజపాతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడంపై విమర్శలు తలెత్తుతున్నాయి. దీనిపై ఎన్సీపీ అధినేత శరద్పవార్ స్పందిస్తూ నీతీశ్ చర్యపై మండిపడ్డారు. ఆయన భాజపాతో చేతులు కలుపుతారని అసలు ఊహించలేదు. మళ్లీ ఎన్డీయేతో పొత్తు పెట్టుకోవడంపై ఆయనకే స్పష్టత లేదు. దీనికి బదులుగా భవిష్యత్తులో ప్రజలు నీతీశ్కు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.