ఆర్మూర్ నియోజకవర్గంలో ఉదయం నుంచే వేడి తీవ్రత కనిపిస్తోంది. మధ్యాహ్నానికి ఎండ తీవ్రత తారాస్థాయికి చేరుతోంది. కాక పుట్టించే సూర్యకిరణాలు తమ ప్రభావాన్ని చూపుతున్నాయి. మార్చి మాసం ఆరంభం నుంచే ఎండ తీవ్రత పెరుగుతూ వస్తుంది. ఈసారి మరింత ఎండలు కాసే అవకాశం ఉంది. పెరుగుతున్న పగటిపూట ఉష్ణోగ్రతలతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు అని అక్కడ స్థానికులు బుధవారం తెలిపారు.