
నిజామాబాద్: జీత భత్యాల కోసం రోడ్డెక్కిన ఆశా వర్కర్లను అరెస్టు చేశారు
నిజామాబాద్ జిల్లా నుండి ఆదివారం వివిధ నియోజకవర్గాలకు చెందిన ఆశా వర్కర్లు తమకు జీతభత్యాలు పెంచాలంటూ అసెంబ్లీ ముట్టడి కోసం వెళ్లిన ఆశా వర్కర్లను హైదరాబాద్ కోటిలో అరెస్టు చేశారు. హెల్త్ కమిషనర్ ఆఫీస్ దగ్గర అందర్నీ అరెస్టు చేశారు. రాష్ట్రంలో పలుచోట్ల ఎక్కడికక్కడే అరెస్టులు జరిగాయి. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న రేవంత్ సర్కార్ వెంటనే భర్తల చేయాలంటూ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.