ఆటో, బైక్ ఢీ.. ఐదుగురికి గాయాలు

18283చూసినవారు
ఆటో, బైక్ ఢీ.. ఐదుగురికి గాయాలు
బాల్కొండ నియోజకవర్గం మోపాల్ మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బోర్గాం గ్రామానికి చెందిన ప్రదీప్ సోమవారం బైక్ పై మోపాల్ వెళ్తుండగా నిజామాబాద్ నుంచి వస్తున్న ఆటోను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ప్రదీప్ తలకు తీవ్ర గాయాలు కాగా ఆటోలోని నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై ఎస్ హెచ్ఓ గంగాధర్ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్