బోధన్: ప్రైవేట్ కళాశాలల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించాలి

78చూసినవారు
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో యాజమాన్యాలు బుధవారం బోధన్ పట్టణంలో మానవహారం నిర్వహించారు. గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రోజులుగా కళాశాలలు బందుతో పాటు ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేశారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద మనవహారం నిర్వహించి తమ డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని ఆందోళన చేపట్టారు.

సంబంధిత పోస్ట్