కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఏలేటి సాయి ప్రశాంత్(28) అనే యువకుడు తీవ్రగాయలై అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండలంలోని బ్రాహ్మణ పల్లి గ్రామ శివారులో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తొర్లికొండ గ్రామానికి చెందిన సాయి ప్రశాంత్ తొర్లికొండ నుండి కారులో ఆర్మూర్ వెళుతుండగా బ్రాహ్మణ పల్లి గ్రామ శివారులో కారు అదుపు తప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందన్నారు.