దుబాయిలో గుండెపోటుతో నిజామాబాద్ జిల్లా వాసి మృతి
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన కాశెట్టి విజయ్ దుబాయ్ గుండెపోటుతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. నాలుగేళ్లుగా విజయ్ దుబాయిలో ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. కంపెనీకి వెళ్లే సమయంలో గుండెపోటు రావడంతో మృతి చెందాడని వారు పేర్కొన్నారు.