ఉత్తరప్రదేశ్ బస్తీలోని గోట్వా టాటా ఏజెన్సీ సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అయోధ్యకు వెళ్తున్న ట్రక్కు ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.