గ్రంథాలయ గదిని ప్రారంభించిన పిట్లం మండల విద్యాధికారి

68చూసినవారు
గ్రంథాలయ గదిని ప్రారంభించిన పిట్లం మండల విద్యాధికారి
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం మండల విద్యాధికారి దేవిసింగ్ పాఠశాల తెలుగు ఉపాధ్యాయ బృందం ఏర్పాటు చేసిన గ్రంథాలయ గదిని ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవి సింగ్ మాట్లాడుతూ. పాఠశాలలో విద్యార్థులకు ఈ సౌకర్యం కల్పించిన తెలుగు ఉపాధ్యాయులు సత్యనారాయణ, సవంతా బాయిలను అభినందిస్తూ, విద్యార్థులకు తగు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్