మల్లికార్జున స్వామి కళ్యాణ మండపానికి విరాళం అందజేత

66చూసినవారు
మల్లికార్జున స్వామి కళ్యాణ మండపానికి విరాళం అందజేత
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో మల్లికార్జున స్వామి కళ్యాణ మండపం నూతన భవన నిర్మాణానికై మాదిగ కుల సంక్షేమ సంఘం వారు ధన రూపేణా రూ. 11, 116/- విరాళంగా ఆదివారం అందజేశారు. ఈ బృహత్ కార్యంలో నిమగ్నమైన మాదిగ కుల సంక్షేమ సంఘం సభ్యులందరికీ పేరు పేరున, వారి కుటుంబ సభ్యులకు దేవునిపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో రాజుపాటిల్, మర్కంటి స్వామి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్