ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి వృద్ధుడు మృతి

75చూసినవారు
ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి వృద్ధుడు మృతి
ప్రమాదవశాత్తు కాలుజారి కుంటలో పడి వృద్ధుడు మృతి చెందిన ఘటన సిరికొండ మండలం గడ్డమీద తండాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన గుగులోత్ హరియా (55) కాళ్లు కడుక్కోవడానికి కుంటలో దిగాడు. ప్రమాదవశాత్తు కాలుజారడంతో కుంటలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య గోరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్