సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

54చూసినవారు
నవీపేట్ మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న 375 వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న వీరత్వం ఆయన చేసిన త్యాగం మరవరానిదని అన్నారు. ఆయన ఆదర్శాలను ముందుకు తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో సాయి కుమార్ గౌడ్, గంగాధర్, గౌడ సంఘ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్