నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో భాగంగా సీఎంసీ కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, ఈ మేరకు కౌంటింగ్ కోసం చేపడుతున్న ఏర్పాట్లను శనివారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగేనవార్, అదనపు కలెక్టర్ అంకిత్, నగర పాలక సంస్థ కమిషనర్ మకరంద్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భద్రతాపరమైన ఏర్పాట్లను వేగవంతం చేయాలని ఆదేశించారు.