నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బసవ గార్డెన్ లో శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ యోగ కార్యక్రమానికి హాజరైన నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తుకారాం మాట్లాడుతూ నిత్య జీవితంలో మనుషులు ఎదుర్కొనే ప్రతి మానసిక శారీరక సమస్యలకు పరిష్కారము కేవలం యోగా మాత్రమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన అధికారిని శైలి బెల్లాల్, డాక్టర్ రమణ మోహన్, డాక్టర్ తిరుపతి, మోహన్ దాస్ పాల్గొన్నారు.