నిజామాబాదులో వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

79చూసినవారు
నిజామాబాదులో వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీకి చైర్మన్ తహేర్ బిన్ హాందాన్ మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి సేవలు ఎన్నటికీ మరువలేనివని, ఎల్లప్పుడూ పేద మధ్యతరగతి ప్రజల అభివృద్ధి గురించి ఆలోచించిన వ్యక్తి వైయస్సార్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్