అతివేగంతో అదుపుతప్పిన కారు...
నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్ రావుపల్లి గేట్ సమీపంలో జాతీయ రహదారి 161పై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్సై కే. సుధాకర్ కథనం మేరకు.. హైదరాబాద్ కు చెందిన ముగ్గురు వ్యాపారులు వ్యక్తిగత పనుల నిమిత్తం మహారాష్ట్రకు కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలోనే కారు నిజాంసాగర్ మండల పరిధిలోని నర్సింగరావు పల్లి గేటు వద్దకు రాగానే అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టి పక్కనే ఉన్న గుంతలో పడిపోయింది.