కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటులో జాప్యం చేయవద్దని జేడీయూ అధినేత నితీశ్ కుమార్ మోదీకి సూచించారు. తక్షణమే ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, రాష్ట్రపతిని కలవడంలో జాప్యం చేయొద్దని ఎన్డీయే కూటమి సమావేశంలో అన్నారు. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో జేడీయూ 12, బీజేపీ 240, టీడీపీ 16 స్థానాలతో కీలక పాత్ర పోషిస్తోంది. ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ, జేడీయూ కీలకం కానున్నాయి.