కాంగ్రెస్ హయాంలో అవకతవకలు జరగలేదు: డీకే

83చూసినవారు
కాంగ్రెస్ హయాంలో అవకతవకలు జరగలేదు: డీకే
మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) ప్లాట్ల కేటాయింపులకు సంబంధించి రెండేళ్ల క్రితం బీజేపీ హయాంలోనే అవకతవకలు జరిగాయని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. ఆ వివరాలతో త్వరలోనే జాబితాను విడుదల చేస్తామన్నారు. ముడాకు చెందిన 14 విలువైన ప్లాట్లను భార్యకు కేటాయించుకున్న కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేయాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి డిమాండ్ చేయడంతో ఈ వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్