చార్ ధామ్ యాత్రలో ఇకపై వీడియోలు, రీల్స్ చిత్రీకరణను నిషేధిస్తున్నట్లుగా ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ రాధా రాటూరి తెలిపారు. ఉత్తరాఖండ్ సీఎం పలువురు భక్తుల కోరికమేరకు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆమె తెలిపారు. ఇకపై ఆలయాల ప్రాంగణంలోని 50 మీటర్ల పరిధిలో వీడియోలు, రీళ్ల చిత్రీకరణపై నిషేధం ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటివరకు దాదాపు 3 లక్షల మంది భక్తులు చార్ ధామ్ను సందర్శించారు.