హెచ్ఎండీఏ పరిధిలో 617 లేక్ల నోటిఫికేషన్ పెండింగ్లోనే ఉన్నాయి. 2018 నవంబరులో జరిగిన కమిటీ సమావేశంలో 3132 లేక్లకు గాను కేవలం 165 లేక్లను మాత్రమే తుది నోటిఫై చేసినట్లు గుర్తించారు. 2019 జనవరి 31 నాటికి అన్ని లేక్ల తుది నోటిఫికేషన్ జరగాలని నిర్ణయించినా జరగలేదు. 2021 ఏప్రిల్లో హెచ్ఎండీఏ పరిధిలోని జిల్లాల అదనపు కలెక్టర్లకు(స్థానిక సంస్థలు) ఈ బాధ్యత అప్పగించారు. తర్వాత పురపాలక శాఖ కార్యదర్శికి ప్రత్యేకంగా ఈ బాధ్యత అప్పగించినా ఫలితం లేకపోయింది.