బీజేపీపై ఒడిశా సీఎం ఫైర్

59చూసినవారు
బీజేపీపై ఒడిశా సీఎం ఫైర్
ఒడిశా సీఎం, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల ఆయన ఓ బహిరంగ సభలో మాట్లాడుతుండగా తన ఎడమచేయి వణకడంపై అసోం సీఎం హిమంత బిశ్వశర్మ విమర్శలు చేశారు. దీనికి బదులిచ్చిన నవీన్ పట్నాయక్.. 'లేని సమస్యను ఉన్నట్టుగా సృష్టించడం బీజేపీకి అలవాటే. తన చేయి గురించి వారు కొత్తగా చర్చ మొదలుపెట్టారు. అయినా ఇలాంటి పనుల వల్ల ప్రజలు ఓట్లు వేయరని వారు గుర్తించుకోవాలి' అంటూ స్పందించారు.

సంబంధిత పోస్ట్