ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధుడి మృతి

68చూసినవారు
ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధుడి మృతి
తెలంగాణలోని మియాపూర్ పీఎస్ పరిధిలో సోమవారం ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధుడు మరణించిన ఘటన చోటుచేసుకుంది. మియాపూర్ బొల్లారం చౌరస్తా సమీపంలో రోడ్డు దాటుతున్న సుమారు 70 ఏళ్లున్న గుర్తు తెలియని వ్యక్తిని ఉప్పల్ వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్రగాయాలు కావడంతో అతడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణం డ్రైవర్ నిర్లక్ష్యమా లేక వృద్ధుడి తప్పిదమా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్