'వృద్ధులు, పిల్లలు బయటికి రావొద్దు'

64982చూసినవారు
'వృద్ధులు, పిల్లలు బయటికి రావొద్దు'
తెలంగాణలో భానుడు నిప్పులు కురుస్తున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల కంటే అధికంగా నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలోని నిడమనూరులో అత్యధికంగా 43.5 డిగ్రీల టెంపరేచర్ రికార్డు అయింది. రేపు, ఎల్లుండి తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సమయంలో వృద్ధులు, పిల్లలు బయటికి రావొద్దని హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్