'ఒకనాడు నెర్రలుబారిన బీళ్లు.. ఈనాడు నెర్రెలుబారిన ప్రాజెక్టులు'

586చూసినవారు
ఇవాళ మేడిగడ్డ ప్రాజెక్టును సీఎం రేవంత్ బృందం పరిశీలించింది. ఈ మేరకు సీఎం Xలో స్పందిస్తూ.. 'తెలంగాణలో ఒక నాడు నీళ్లు లేక నెర్రెలుబారిన బీళ్లు.. ఈ నాడు అవినీతి కారణంగా నెర్రెలుబారిన ప్రాజెక్టులు. అది ఆంధ్రా పాలకుల పాపం.. ఇది కేసీఆర్ పాలన శాపం.' అని ట్వీట్ చేశారు. మంత్రి సీతక్క ట్వీట్ చేస్తూ.. 'కూలింది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు.. తెలంగాణ ప్రజల నమ్మకం. కుంగింది మేడిగడ్డ పిల్లర్లు కాదు 4 కోట్ల ప్రజల ఆశలు.' అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్