సీబీఎస్ఈ పది, 12వ తరగతి బోర్డు పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించే విషయంలో కేంద్ర విద్యాశాఖ త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. 2025-26 విద్యా సంవత్సరం నుంచే ఈ సరికొత్త విధానాన్ని అమలుచేసేలా వ్యూహరచన చేయాలని సీబీఎస్ఈని కోరింది. ఈనేపథ్యంలో మార్చిలో ఒకసారి, జూన్లో రెండోసారి పరీక్షలు నిర్వహించే అంశాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే మార్చిలో పరీక్షలు రాసిన విద్యార్థులు జూన్లో మరోసారి అన్ని పరీక్షలు రాయొచ్చు.