నీట్ పేపర్ లీకేజీపై చర్చకు విపక్షాల పట్టు

76చూసినవారు
నీట్ పేపర్ లీకేజీపై చర్చకు విపక్షాల పట్టు
రెండు రోజుల విరామం తర్వాత పార్లమెంట్ సమావేశాలు ఇవాళ తిరిగి ప్రారంభమయ్యాయి. ఈరోజు సభ ప్రారంభం కాగానే నీట్‌ పేపర్ లీకేజీపై లోక్‌సభలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. విపక్షాల నిరసన మధ్య సభ కొనసాగుతోంది. మొదట వివిధ కమిటీల నియామకాలకు సంబంధించిన ప్రతిపాదనలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సభ ముందుంచారు. ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు స్పీకర్ ఓంబిర్లా అనుమతించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్