కేఆర్ఎంబీకి తమ ప్రభుత్వం ప్రాజెక్టులు అప్పగించలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు. ఇవాళ సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. 'కేఆర్ఎంబీకి మా ప్రభుత్వం ప్రాజెక్టులు అప్పగించలేదు. హరీశ్రావు అబద్ధాలు చెబుతున్నారు. కృష్ణా జలాల వాటాల్లో కేసీఆర్, జగన్ కలిసి తెలంగాణకు అన్యాయం చేశారు. మనకు రావాల్సిన కృష్ణా జలాలను ఏపీకి తీసుకెళ్తుంటే కేసీఆర్ సహకరించారు.' అని ఆరోపించారు.