భారత్కు చెందిన సరబ్జిత్ సింగ్ను పాక్ జైలులో చంపిన డాన్ అమీర్ సర్ఫరాజ్ తాంబా హతమయ్యాడు. లాహోర్లో అతడిని గుర్తు తెలియని దుండగులు చంపారు. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్కు తాంబా సన్నిహితుడు. ఇక భారత్లోని పంజాబ్కు చెందిన రైతు సరబ్జిత్ సింగ్ పాక్ భూభాగంలో పొరపాటున ప్రవేశించి అరెస్ట్ అయ్యాడు. అతడిని జైలులో తాంబాతో పాటు కొందరు ఖైదీలు క్రూరంగా చంపారు.