అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం కల్లూరులో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ అరాచక పాలనను అంతం చేయడానికి ప్రజలంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఐదేళ్లలో వైసీపీ నాయకులు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.