అధికార గర్వం ఉన్న వారిని ప్రజలు వెంటపడి తరుముతారని పవన్ కళ్యాణ్ అన్నారు. దోపిడీ దౌర్జన్యాలు ఇలాగే కొనసాగిస్తే శ్రీలంక అధ్యక్షుడికి పట్టే గతే సీఎం జగన్కూ పడుతుందని ధ్వజమెత్తారు. జగన్కు అధికార గర్వం తలకెక్కింది.. అందరినీ తన బానిసలుగా భావిస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లి ప్యాలెస్లోకి కూడా జనం చొచ్చుకెళ్లే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. తెనాలిలో నిర్వహించిన
వారాహి యాత్రలో పవన్ ఈ మేరకు మాట్లాడారు.